తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ చాల పెద్ద పండగ. ప్రేత్యేకంగా ఆంధ్ర లో అయితే సంక్రాంతి – సినిమాలు తప్ప ,మరో వినోదం ఉండదు. ఈ సంక్రాంతి సినిమాల నేపథ్యంలో అందరి దృష్టి దిల్ రాజు అనే బడా నిర్మాత, థియేటర్స్ ఓనర్, డిస్టిబ్యూటర్ మీద పడింది.
ఇండస్ట్రీలో వున్న పలు విమర్శలు లేదా కామెంట్ లను ఆయన దృష్టికి తీసుకెళ్ళి క్లారిటీ తీసుకొనే సందర్బంగా ప్రముఖ సినిమా వెబ్ సైట్ ప్రతినిధి తో దిల్ రాజు గారు స్పెషల్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ మాటా మంతీలో ఆ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాదానాలు ఇచ్చారు దిల్ రాజు అనబడే వెంకట రమణ రెడ్డి గారు.
మీడియా తన మీద రాస్తున్న కథనాల మీద తన అసంతృప్తిని, అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే, థియేటర్ల సమస్య అన్నది తనకు..అవతలి నిర్మాతలకు సంబంధించినది అని, మధ్యలో మూడో వ్యక్తు (మీడియా లేదా కౌన్సిల్) కి ఏం అవసరం అని అంటారు దిల్ రాజు. అంటే ఆయన దృష్టిలో ఈ సమస్యను మీడియా పట్టించుకోకూడదు, సినిమా నిర్మాతల మండలి కూడా పట్టించుకో కూడదు అనా?

ఈ సంక్రాంతి సినిమాల థియేటర్స్ కొడవకి అసలు కారణం అయినా వారసుడు సినిమా డబ్బింగ్ కాదని, పాన్ ఇండియా సినిమా అని మరో కొత్త పాయింట్ తెరపైకి తెచ్చారు. ఇకపై ఏ భాషా సినిమా ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రదర్శించుకో వచ్చు అనే కొత్త వాదనను దిల్ రాజు ఈ విధంగా తెరపైకి తెచ్చారు.
అంతే కాదు. రోజులు మారాయని, అంతా గ్లోబల్ గా మారిందని, ఇకపై ఏ టాప్ హీరో, టాప్ దర్శకుడు కోసం వేచి వుండక్కరలేదని, మంచి కథ తో కంటెంట్ కొత్తగా వుంటే ఏ హీరో, దర్శకుడి తోనైనా సినిమాలు సెట్ చేసుకొని సినిమాలు నిర్మించుకొని వ్యాపారాం చేసుకో వచ్చు అంటారు.
మీడియా సంగతి సరే, ఇండస్ట్రీ జనాలు కూడా ఎందుకు మిమ్మల్ని విమర్శిస్తున్నారు అనే ప్రశ్నకు కు తన సమాధానం చాలా ఆసక్తికారంగా ఉంది. అయన మాటలలో వినాలి అంటే కౌన్సిల్ లో ఉన్న నిర్మాతలు ఎంత మంది ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు…?
అలాంటి కౌన్సిల్ కు ఎన్నికలు ఎందుకు అన్నారు. కౌన్సిల్ బాడీలో మూడు వంతుల మంది సినిమాలు తీయని వారే అంటారు.

ఉత్తరాంధ్రలో తన కు వున్న ౩7+ థియేటర్లలో కొన్నయినా చిరంజీవి, బాలకృష్ణ ల వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లకు ఇస్తారా అంటే చాల సింపుల్ గా తన వారసుడు సినిమా వుంది కదా అంటారు. అయితే మీ ధియేటర్లలో ఆ తెలుగు టాప్ హీరోల సినిమాలు వేయరన్నమాట అని మరలా క్లారిటీ కోసం అడిగితె, అలా కాదు..పండగ దగ్గర చేసి సినిమా కి వచ్చే హైప్ చూసిన తరువాత బిజినెస్ జరుగుతుంది అంటే అప్పుడు ఆలోచిస్తాను అని చెప్తారు.
కార్తికేయ 2 టైమ్ లో హీరో నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్న వైనం గుర్తు చేస్తే పబ్లిసిటీ స్టంట్ ఏమో అంటారు. అదే సినిమాను వెనక్కు పంపాలనుకున్నపుడు తెలంగాణా మంత్రి గారు ఫోన్ చేసారన్న వార్తలు గుర్తు చేస్తే, ఎందుకు చేసారు. ఏం చెప్పారు అన్నది కాకుండా, తనకు మంచి మిత్రుడు కాబట్టి మాట్లాడుకున్నాము అంటారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అడిగిన ప్రశ్నకు కు ,స్పైడర్, అజ్ఙాతవాసి ల వల్ల తాను డిస్టిబ్యూటర్ గా గట్టిగా దెబ్బతిన్నా అంటూనే మహేష్ సినిమా ఎప్పుడు ఉన్నా ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తా అంటారు.

చివరాఖరికి 2023 సంక్రాంతి పండగ సినిమాల పోటీ గురించి దిల్ రాజు చెప్పేది ఏమిటంటే, మీకు దొరికినన్ని థియేటర్లలో సినిమా వేసుకోండి. ఏ సినిమా బాగుంటే ఆ సినిమాలకు విడుదల తరువాత జనాల ఒత్తిడిని బట్టి థియేటర్లు అవే వస్తాయి అంటారు. సినిమా ఇండీస్ట్రీ లో అందరూ వ్యాపారమే చేస్తున్నపుడు తను ఎందుకు తన వ్యాపారం వదులుకుంటా అని చెప్పుకొచ్చారు.
అంటే తెలుగు టాప్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి అయినా, నందమూరి బాలకృష్ణ అయినా, తన నిర్మాణ సంస్థ నుండి వస్తున్న వారసుడు సినిమా తర్వాతే అని తన సక్సెస్ కి కారణం అయినా వ్యాపార సూక్తిని ముక్త వళిని వ్యక్తపరిచారు.
సో, ఇది మా ప్రముఖ జర్నలిస్టి గారి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ దిల్ రాజు గారు. మీకు ఇంకా క్లారిటీ కోసం ఆ ఇంటర్వ్యూ లింకు ఇక్కడ ఇస్తున్నాము.