తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది.కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.ఈ చిత్రం ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా నిర్మితమవుతోంది.
ప్రముఖ వ్యాపారవేత్త రవి పనస నిర్మాత. ఈ చిత్రంతో గోపి.జి దర్శకుడిగా పరిచయ మవుతున్నారు. ఈ సినిమా మొదటి షాట్ ను దర్శకుడు వేణు ఉడుగుల డైరెక్ట్ చేయగా, బీ.ఆర్.ఎస్ నాయకులు దాసోజు శ్రావణ్ క్లాప్ కొట్టారు.నిర్మాత రవి పనస కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25వ తేదీ నుండి మొదలవనుంది. అత్యున్నత సాంకేతికి విలువలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు తెరపై ఈ సినిమా ఒక గొప్ప ప్రయత్నంగా పేరు తెచ్చుకుంటుందని, ఆడియెన్స్ కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు.
నటీనటులు:
తిరువీర్, ఫరియా అబ్దుల్లా, రిషి, రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ తదితరులు
టెక్నికల్ టీమ్:
సినిమాటోగ్రఫీ – రాజ్ తోట, మ్యూజిక్ – కె.పి, ప్రొడక్షన్ డిజైనర్ – గాంధీ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా, సమర్పణ – ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ , బ్యానర్ – రవి పనస ఫిలిం కార్పొరేషన్, నిర్మాత – రవి పనస, రచన, దర్శకత్వం – గోపి.జి