మణిరత్నం సినిమాలకు మొదటి నుంచి తెలుగు సినిమా సర్కిల్ లోనూ మంచి క్రేజ్ ఉంది. అయితే గత కొంతకాలంగా ఆయన సినిమాలు భాక్సాఫీస్ దగ్గర ఎక్కువ రోజులు నిలబడటం లేదు.
ఆయనకి గత 20 years గా ఓ డ్రీమ్ ఉంది. తమిళంలో బాగా ప్రాచుర్యం పొందిన ‘కల్కి పోన్నీయన్ సెల్వం నవలను తెరకెక్కించాలని. అందుకోసం ఆయన చాలా కష్ట,నష్టాలకు ఓర్చి, భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఇప్పటి సినీ ప్రపంచానికి అర్దం అయ్యేలా తెరకెక్కించారు.
ఈ ps 1 సినిమాని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నా పెద్దగా బజ్ లేదు. తమిళంకే పరిమితమైన చరిత్రను తెలుగు వారు చూడటం కష్టమనే భావన చాలా మందిలో ఉంది.
తెలుగువారికి ఈ కథ నచ్చుతుందా ? …అసలు చోళ డాయనాస్టీ ఇప్పటి జనరేసన్ కి ఎక్కుతుందా ? బాహుబలి స్దాయిలో కాకపోయినా సగం అయినా వర్కవుట్ అవుతుందా ?
అంతా మంది సినీయర్ ఆర్టిస్టుల లో ఎవరికీ ఎక్కువ సీన్స్ ఉన్నాయి ?
లాంటి ప్రశ్నలకు సమాదానం తెలియాలి అంటే సినిమా చూస్తేనే అర్దం అవుతుంది. నా రివ్యూ నాకు అర్దం ఎంతవరకూ నచ్చింది అనే పాయింట్ లో ఉంటుంది.
మీకు వచ్చిన ఆలోచనలు కామెంట్స్ రూపం లో పోస్ట్ చేయండి. మిలొ కూడా రివ్యూ మరియు క్రిటిక్స్ రైటర్ ఉంటే కామెంట్స్ రూపం లో రాయండి. సినీ ప్రేకశకులకు చేరేలా ఉంటే మా వెబ్ సైటు లో పుబ్లిస్ చేస్తాను ..
కథ, కధనం గురించి చెప్పాలి అంటే:
పదో శతాబ్దం అంటే వెయ్యి సంవత్సరాల క్రితం పరిపాలన సాగించిన చోళ రాజ్యపు రాజుల గొప్పతనం గురించి చెప్తూ ఈ కథ మొదలవుతుంది. అప్పటి చోళ రాజ్యంను ఎలాగైనా సామ,దాన,దండోపాయాలతో దక్కించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తూంటారు.
ఈ కుట్రలు కుతంత్రాలు యువరాజు ఆదిత్య కరికాలుడు(విక్రమ్) కు ఓ సవాల్ గా మారుతుంది. తనదైన శైలిలో తన రాజ్యాన్ని రక్షించేందుకు వ్యూహాలు రచిస్తూంటాడు
ఆ క్రమంలో రాజ్య ఆక్రమణ కోసం చోళ రాజ్య చక్రవర్తి వారసులను చంపటం వెనక పెద్ద కుట్ర జరుగుతోందని తేలుస్తోంది. ఆ కుట్రను ఛేదించటానికి కరికాలుడు తన మిత్రుడు వల్లవరాయ (కార్తి) ని పంపుతాడు.
ఈ క్రమంలో ఏమి నిజా నిజాలు ఏమిటి ?
అసలు కుట్రకు కీలక వ్యక్తులు ఎవరు?
అరుమౌలీ (జయం రవి) ని వల్లవరాయ ఎలా రక్షించాడు?
ఆరు మౌళి కి పోన్నీయన్ సెల్వం అనే పేరు ఎలా వస్తుంది?
అనేది ఈ భాగంలోని ప్రధాన కథ. ఇందులో కుందవాయి(త్రిష), నందిని(ఐశ్వర్య రాయ్) పాత్రలు కీలకమైనవి.
కల్కి నవల సినిమా రూపం లో ఎలా ఉందంటే:
చిరంజీవి వాయస్ ఓవర్ తో మొదలయ్యే ఈ చిత్ర మొదటి భాగం చారిత్రక సంఘటనలతో ముడిపడింది. ఈ చిత్రం కథకు మూలం పొన్నియిన్ సెల్వన్ అనే తమిళనాడులో పాపులరైన ఒక చారిత్రక నవల.
దీన్ని కల్కి కృష్ణమూర్తి (1899-1954) రాశారు. ప్రముఖ చరిత్రకారులు కె.ఎ. నీలకంఠ శాస్త్రి రాసిన ‘ది చోళాస్’ పుస్తకం, టి.వి. సదాశివ బండారుతార్ రచించిన ‘హిస్టరీ ఆఫ్ లేటర్ చోళాస్’, ఆర్. గోపాలన్ రాసిన ‘పల్లవాస్ ఆఫ్ కంచి’ అనే పుస్తకాల ఆధారంగా కల్కి ఈ నవలను రాశారు.
తన మ్యాగజీన్ ‘కల్కి’ కోసం 1950 నుంచి మూడేళ్ల పాటు ఈ నవలను ఒక సిరీస్ రూపంలో ప్రచురించారు అనేది చరిత్ర. చోళులలో ప్రసిద్ధుడైన రాజ రాజ చోళుడు-1 తండ్రి పరాంతక చోళుడు-2 కాలంలోని కొన్ని చారిత్రక సంఘటనలను దృష్టిలో ఉంచుకొని కల్కి ఈ నవలను రాశారు.
పరాంతక చోళునికే సుందర చోళ అనే మరో పేరు కూడా ఉంది. కల్కి రాసిన ఈ నవలలో చారిత్రక పాత్రలతో పాటు కాల్పానిక పాత్రలు కూడా ఉన్నాయి. కల్కి నవలను 5 భాగాలుగా రాశారు. వాటిన్నటిని బేస్ చేసుకుని మణి రత్నం ఈ సినిమా తీసారు.
మణిరత్నం ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అందులో మొదటి భాగమే ఇప్పుడు విడుదల అయ్యింది.
మణిరత్నం కంటే ముందు చాలామంది ఈ నవలను సినిమాగా తీయడానికి ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఇన్నాళ్లకు తెరకెక్కిన ఈ చిత్రరాజం తమిళం వాళ్లకు నచ్చే అంశాలతోనే తెరకెక్కింది.
అందులో వింత , విచిత్రమూ కూడా లేదు. ఇది బాహుబలి కథలా స్వంతంగా రాసుకున్న ఫిక్షన్ కథ అయితే యూనవర్శిల్ అప్పీల్ తెచ్చే అవకాసం ఉండేది. కానీ కానీ ఈ కధ కు ఆ అవకాశం లేదు.
అలాగే ఈ కథను పూర్తిగా పుస్తకం అనుసరించి చేయటం వల్లనేమో …ట్విస్ట్ లు, వావ్ ఎలిమెంట్స్ ప్రత్యేకంగా స్క్రీన్ ప్లే లో కనపడలేదు.
వరసగా పాత్రల పరిచయం జరిగిపోతూంటుంది. కథ జరిగే ప్రాంతాలు మారిపోతూంటాయి. కానీ కథ కదిలినట్లు అనిపించదు. దానికి తోడు స్లోగా కథ నడవటం కూడా ఇబ్బంది పెడుతుంది.
నటీనటుల నటన విషయానికి చూస్తే:
తెరపై కనిపించే నటులంతా ఆల్రెడీ అద్బుతాలు చేయగలరని ప్రూవ్ అయిన వారే. ముఖ్యంగా విక్రమ్,త్రిష,ఐశ్వర్యరాయ్ వంటి వారు గురించి చెప్పేదేముంది. అందూలోనూ మణిరత్నం వంటి దర్శకుడు చేతిలో పడ్డాక ఆ మాణిక్యాలు మరింత మెరుగు దిద్దుకుంటాయి.
చోళ రాజు ఆదిత్య కరికాలుడు పాత్రలో విక్రమ్ నటన అయితే మామూలుగా ఉండదు. ఒక గొప్ప యోధుడి గా మనకు గుర్తుండిపోతాడు. త్రిష, ..వయస్సు పెరుగుతున్నా చెక్కు చెదరని అందం..నందినిగా చేసిన ఐశ్వర్య లుక్ తోనే అభిమానులను ఆకట్టుకుంది.
కార్తి కేక పెట్టించాడు మొదటి భాగం హీరో ఎవరు అంటే టక్కున కార్తీ పేరే వస్తుంది. టైమింగ్ తో కూడిన డయాలాగ్స్ పడటం వలన మనతో పాటు కార్తీ అదే నండి వాలవ రాయ ఇంటికి వచ్చేస్తాడు \
జయం రవి తెలుగు ప్రేకశకులకు తక్కువ పరిచయం వలన ఓకే అనిపిస్తాడు. ప్రకాష్ రాజ్ ఏ పాత్ర చేసినా పాదరసంగా మారిపోతాడు.
ఫోటోగ్రఫీ మ్యూజిక్ ఇంకా టెక్నికల్ విసయాలు చూస్తే:
భారతదేశం సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకులలో మణిరత్నం ఒకరు అనే విషయంసినిమా ప్రేకశకులకు పరిచయం అక్కరలేదు.
అయితే ఆయనకు ఈ మధ్య సక్సెస్ లేకపోవటం సినీ అభిమానులను బాధ పెడుతోంది. మణిరత్నం ప్రతీ సినిమా అంతే శ్రద్దగా విజువల్ గా అద్భుతంగా తీస్తారు.
ఈ సినిమా కూడా ఆయన స్టైల్ లో శిల్పంలా చెక్కుదామనే ప్రయత్నం చేసారు. అయితే స్క్రిప్టులో ఈ కాలం ప్రేక్షకులు ఆశిస్తున్న మరింత కొత్తదనం, కొత్త ఎలిమెంట్స్ వంటివి ఎక్కువగా ఆశిస్తారు.
]అయితే కల్కి రచించిన 5 భాగాల పెద్ద నవలను…కుదించి, క్యారక్టర్స్ ని కొన్ని మాత్రమే తీసుకుని స్క్రిప్టు రాయటం అంటే మామోలు విశయం కాదు.
అందులోనూ ఈ జనరేషన్ కు అర్దమయ్యేటట్లు ఆ కథను చెప్పాలి. అప్పట్లో అంటే కల్కి నవలలు చదివిన వారు ఎక్కువమంది ఉండేవారు కాబట్టి ఈజీగా అర్దమవుతుంది. ఇప్పుడు అంటే చాలా సులభంగా అర్దమయ్యేలా చెప్పగలిగాలి.
ఆ విషయంలో దాదాపు మణిరత్నం సక్సెస్ అయ్యారా అంటే సినిమా చూసిన తెలుగువారికి ఆ చరిత్ర, పాత్రలు కాస్త ఇబ్బంది పెడతాయి. ఇక ఎప్పటిలాగే సినిమాటోగ్రఫీ గురించి వచ్చే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
పాటలు తమిళ ఫ్లేవర్ తో నిండిపోయాయి.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ బలం చేకూరచేలా కొన్ని చోట్ల ఉన్నాయి కానీ. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా అద్బుతం అని చెప్పలేం కానీ పరవాలేదు.
తెలుగు వెర్షన్ కి డైలాగులు తణికెళ్ళ భరణి రాసారు. కొన్ని చోట్ల ఒరిజనల్ లోని పదాల అల్లిక వర్కవుట్ అవ్వలేదు. ఎడిటింగ్ లో చిన్న చిన్న లోపాలా లేక సినిమా యాక్షన్ సీన్స్ 18 ఫ్రేమ్స్ లో ఘాట్ చేశారా అనే విదంగా క్లారిటీ లేకుండా యాక్షన్ సీన్స్ ఉన్నాయి. చిత్ర నిర్మాణ విలువలు బాగున్నాయి.
18F Opinion:
భారీ బడ్జెట్ తో మణిరత్నం తీసిన ఓ తమిళ కావేరీ పుత్రీడీ చారిత్రాత్మక సినిమా అని చూస్తే టికెట్ డబ్బులకు న్యాయం జరిగినట్టే.