చిత్రం: కలియుగం పట్టణంలో
విడుదల తేదీ : మార్చి 29, 2024,
నటీనటులు: విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్, చిత్రా శుక్లా, దేవీప్రసాద్ తదితరులు,
దర్శకుడు: రమాకాంత్ రెడ్డి,
నిర్మాతలు: డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్,
సంగీత దర్శకులు: అజయ్ అరసాద,
సినిమాటోగ్రాఫర్: చరణ్ మాధవనేని,
ఎడిటింగ్: గ్యారీ బీహెచ్,
మూవీ: కలియుగం పట్టణంలో రివ్యూ (Kaliyugam Pattanamlo Movie Review)
బాల నటుడిగా 50 కి పైగా సినిమాలలో నటించిన విశ్వ కార్తికేయ మెయిన్ లీడ్ లో అచ్చ తెలుగు అమ్మాయి ఆయుషి పటేల్ హీరోయిన్ గా, మరో నటి చిత్రా శుక్లా మరో ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కలియుగం పట్టణంలో .. ఈ సినిమా టీం చాలా చోట్ల కాలేజీ స్టూడెంట్స్ ని కలిసి ప్రోమోసన్స్ చేయడం వలన, పబ్లిక్ లో ఎక్కువ బజ్ క్రియేట్ చేశారు.
కాగా ఈ చిత్రం ఈ శుక్ర వారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి ఈ కలియుగం పట్టణంలో సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !.

కధ పరిశీలిస్తే (Story Line):
విజయ్ – సాగర్ (విశ్వ కార్తికేయ) ఇద్దరు కవల పిల్లలు. ఈ ఇద్దరిలో ఒకరికీ మానసిక సమస్యలు కారణంగా చెడుగా మరో అబ్బాయి ఏ సమస్య లేకుండా బాగా ఉంటాడు. ఇద్దరివి ఒకే పోలికలు మరియు ఒకే రకమైన బట్టలు వేయడం వలన వారి తల్లి తండ్రి కూడా ఎవరు విజయ్ ! ఎవరు సాగర్ అని కన్ఫ్యూస్ అవుతుంటారు.
ఊర్లో చిన్న చిన్న సమస్యలు సృష్టిస్తున్న ఓక అబ్బాయి వలన తండ్రి అవమాన పడుతూ మానసిక సమస్య ఉన్న అబ్బాయిని హాస్టల్ లో ఉంచి చదివించాలని తండ్రి నిర్ణయం తీసుకొంటాడు. తల్లి ప్రేమ కోసం విజయ్పై సాగర్ ద్వేషం పెంచుకొంటాడు.
మానసిక సమస్య ఎక్కువ అయ్యి రక్షసుడుగా మారుతుండడం వలన సాగర్ను హాస్పిటల్లో చేర్పిస్తాడు తండ్రి. దాంతో తండ్రిపై కూడా ద్వేషం పెంచుకొంటాడు సాగర్ . ఇదిలా ఉండగా, కాలేజీలో విజయ్ను ప్రేమించే శ్రావణి (ఆయూషి పటేల్) నంద్యాల పట్టణంలో మహిళలు పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్న మగవాళ్ళను ఒక్కొక్కరిని చంపుతుంటుంది.
నంద్యాలలో వరుస హత్యలే కాకుండా ఆ పట్టణాన్ని పట్టి పీడిస్తున్న ఓ సమస్య కోసం పై ఆఫీసర్స్ ఆర్డర్స్ మేరకు పోలీస్ అధికారి (చిత్ర శుక్లా) ఇన్వెస్టిగేషన్ చేపడుతుంది.
ఇంతకీ, ఈ శ్రావణి ఎవరు ?, ఆమె గతం ఏమిటి ?,
ఎందుకు ఆమెకు మగాళ్లు అంటే నచ్చదు ?,
ఈ మధ్యలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చిత్రా శుక్లా పాత్ర ఏమిటి ?,
చివరకు సాగర్ (విశ్వ కార్తికేయ) ఏం చేశాడు ?
సాగర్కు ఎలాంటి మానసిక సమస్య ఉంది?
ఆ మానసిక సమస్య కారణంగా అమ్మాయిలు ఎలాంటి కఠిన పరీక్షలను ఎదుర్కొన్నారు?
నంద్యాల పట్టణంలో గర్బిణి అమ్మాయిలు ఎందుకు సూసైడ్ చేసుకొంటున్నారు?,
విజయ్ని ప్రేమించి శ్రావణి మగవాళ్లను ఎందుకు చంపుతున్నది?
నంద్యాల పట్టణాన్ని పీడిస్తున్న మరో సమస్య ఏమిటి?
సాగర్ వికృత ప్రవర్తనకు కాలం ఎలాంటి సమాధానం చెప్పింది?
పోలీస్ అధికారి తన ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి భయంకర వాస్తవాలను తెలుసుకొన్నది?

అనే ప్రశ్నలు ఇంటరెస్టింగ్ గా అనిపించి వాటికి జవాబులు తెలుసుకోవాలి అంటే వెంటనే దియేటర్ కి వెళ్ళి ఈ సినిమా చూసేయండి. క్రైమ్ ఇన్వెస్ట్గెటివ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ కలియుగం పట్టణంలో సినిమా బాగా నచ్చుతుంది.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
దర్శకుడు రమాకాంత్ రెడ్డి తీసుకున్న కథాంశం, మరియు విశ్వ కార్తికేయ – ఆయుషి పటేల్ పాత్రలు బాగా వ్రాసుకొన్నప్పటికి కథనం (స్క్రీన్ – ప్లే) మాత్రం చాలా చోట్ల సింపుల్ గా చాలా కొన్ఫ్యూజ్ గా సాగుతుంది. ముఖ్యంగా రెండవ అంకం (సెకండ్ హాఫ్) లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో సాగుతుంది.
హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని లవ్ సీన్స కూడా రెగ్యులర్ గానే ఉంటాయి. దీనికితోడు దర్శకుడు రమాకాంత్ సాగర్ పాత్ర చుట్టే రిపీట్ డ్ సన్నివేశాలు పెట్టి సినిమాని నడిపాడు.
మెయిన్ గా సినిమాలో కొన్ని రొటీన్ అండ్ బోరింగ్ సీన్స్ ను ఎంటర్ టైన్ గా రాసుకుని ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. అలాగే, ప్రీ క్లైమాక్స్ ను, క్లైమాక్స్ ను ఇంకా బాగా డిజైన్ చేసుకోవాల్సింది. దర్శకుడు మునందుగా ప్రకటించిన ఈ సినిమా సీక్వెల్ కలియుగం నగరంలో సిన్మా లోనైనా ఇలాంటి చిన్న చిన్న స్క్రీన్ – ప్లే, మేలో డ్రామా తప్పులు సరిచేసుకుంటారేమో చూడాలి.

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు రమాకాంత్ రెడ్డి కి ఇది డెబ్యూ సినిమా అవ్వడం వలన కొంచెం తడబాటు కనిపించింది. తను మంచి కధను రాసుకొన్నా దానిని తెరపై ఆవిష్కరించడం లో పూర్తిగా విఫలం అయ్యాడు. చెప్పాలి అనుకొన్న కధని సస్పెన్స్ థ్రిల్లర్ గా చెప్పాలనుకొని కధనం (స్క్రీన్ ప్లే) పరంగా అసలు ఆకట్టుకోలేదు.

హీరోగా నటించిన విశ్వ కార్తికేయ తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా డబల్ షెడ్స్ ఉన్న పాత్ర తో కొన్ని ఎమోషనల్ సీన్స్ లో విశ్వ కార్తికేయ తన హావభావాలతో ఆకట్టుకున్నాడు. మానసిక రోగిగా కూడా ఎంతో వాయిలెంట్ లుక్ తో ఆకట్టుకొన్నాడు. రాక్షస ఆలోచనలు ఉన్న సాగర్ పాత్ర సీన్స్, అలాగే, ఫ్లాష్ బ్యాక్ లో అతను చేసిన దారుణాల తాలూకు సీన్స్ లో కూడా అద్భుతంగా నటించి మెప్పించాడు.
హీరోయిన్ గా నటించిన ఆయుషి పటేల్ కి ఇది డెబ్యూట్ మూవీ అయినా తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. లవ్ సీన్స్ లో కూడా ఆమె చాలా సహజంగా నటించింది. ఆయుషీ తెలుగు అమ్మాయి అవడం వలన స్క్రిప్ట్ ని బాగా అర్దం చేసుకొని రెండు షెడ్స్ లో తన నటనతో మెప్పించింది.

మరో హీరోయిన్ చిత్రా శుక్లా కూడా ఓ కీలక పాత్రలో చాలా బాగా నటించింది. తను పాత్ర పరిడి మేరకు రెండు యాక్షన్ సీన్స్ లో కూడా చాలా ఈజ్ తో ఫైట్స్ చేసి ఆకట్టుకుంది.
తండ్రి పాత్రలో నటించిన దేవీప్రసాద్ కూడా పాత్రలో ఒదిగిపోయారు.
‘బలగం’ రూపలక్ష్మి, అనీష్ కురువిల్లా కూడా తమ ఎక్స్ ప్రెషన్స్ తో, తమ శైలి మాడ్యులేషన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
సంగీత దర్శకుడు అజయ్ అరసాద అందించిన పాటలు పర్వాలేదు. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది.
ఎడిటర్ గ్యారీ బీహెచ్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది.
చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సీన్స్ ఫారెస్ట్ బాక్డ్రాప్ లో తీయడం వలన చాలా న్యాచురల్ విజువల్స్ ని తన కెమెరా లో బందించారు.
నిర్మాతలు డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తం సినిమా అంత లైవ్ లొకేసన్స్ లో తీసినా, ఖర్చికి ఎక్కడ రాజీ పడకుండా నిర్మించారు.

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
ఆంధ్ర ప్రదేశ్ లో డ్రగ్స్ కేసులు, గంజా కేసులు ఈ మధ్య బాగా ఎక్కువ అయ్యాయి. అలాంటి ఓక బర్నింగ్ ఇష్యూ ని దర్శకుడు కధ గా రాసుకొని ‘కలియుగం పట్టణంలో’ అంటూ చేసిన డిఫెరెంట్ యాక్షన్ డ్రామాలో డిఫరెంట్ కథాంశంతో పాటు యాక్షన్ సీన్స్ అండ్ ట్విస్ట్ లు బాగున్నాయి.
ఐతే, కొన్ని చోట్ల అసలు కధ యొక్క థీమ్ ఆసక్తికరంగా సాగకపోవడం, సినిమాలో కొన్ని సన్నివేశాలు స్లోగా నాన్ సింక్ లో సాగడం వంటి అంశాలు సినిమా విజయాన్ని దెబ్బ తీశాయి అని చెప్పవచ్చు. ఇలాంటి సైకాలజికల్ ఇష్యూ + డ్రగ్స్ ప్రాబ్లమ్స్ డీల్ చేసేటప్పుడు కధనం ( స్క్రీన్ – ప్లే ) పక్కగా రాసుకోవాలి. కానీ ఈ సినిమా కి పర్ఫెక్ట్ కధనం లేక ఏదో వెలితిగా ఉంది.
ఓవరాల్ గా ఈ సినిమా సామాన్య ప్రేక్షకులను మెప్పించకపోయినా, థ్రిల్లర్స్, కొత్త కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అండ్ ట్విస్ట్ లు మాత్రం అలరిస్తాయి. ఇలాంటి కొత్త కధలను ప్రేక్షకులు ఆదిరించినప్పుడే మరన్ని కొత్త కధలు కినేమాలగా వస్తాయి. ఇలాంటి సమాజ రుగ్మతలను సినిమా కధ గా మలచడం లో తోర్పాటు అందించిన నిర్మాతలను మానష్పూర్తిగా అభినందించాలి.
