తెలుగు రాష్ట్రాల్లోని ఫుడ్ లవర్స్కు అడ్డాగా మారిన బాబాయ్ హోటల్. ఘుమ – ఘుమలాడే తెలుగు వంటకాలను అద్భుతమైన రుచులతో భోజన ప్రియులకు అందించడమే బాబాయ్ హోటల్ నిర్వాకుల ప్రదామ ప్రాధాన్యం. ఈ ఐకానిక్ హోటల్ ప్రస్తుతం హైదరాబాద్ లొని అన్ని ఏరియాల్లోకి విస్తరిస్తోంది.
బాబాయ్ హోటల్ హైదరాబాద్ లో 2022 లో ప్రయాణం మొదలుపెట్టి అన్ని ప్రాంతాలకు ఇస్టరిస్తూ. గత నెలలో మాదాపూర్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసి మరో బ్రాంచ్ను లింగంపల్లిలోని నల్లగండ్ల లో ప్రారంభించేశారు.
కెవి దినేష్ రెడ్డి, శ్రేష్ఠ రెడ్డి కలిసి మదీనా గూడ, మాదాపూర్లో ఏర్పాటు చేసిన రెండు బ్రాంచ్లు విజయవంతంగా దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో లింగంపల్లిలోని నల్లగండ్లలో ఇప్పుడు బాబాయ్ హోటల్ మూడో బ్రాంచ్ను ప్రారంభించారు.
ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ రెస్టారెంట్ ను ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
బాబాయ్ హోటల్ నిర్వాహకులు కెవి దినేష్ రెడ్డి, శ్రేష్ఠ రెడ్డి, మరికొందరు అతిథులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నూతన బ్రాంచ్ను ప్రారంభించడం పట్ల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేస్తూ నల్లగండ్ల లో న్యూ బ్రాంచ్ను ప్రారంభించిన హీరో శ్రీకాంత్కు కృతజ్ఞతలు తెలిపారు.