చాందిని చౌదరి ‘యేవమ్‌ ఆహా ఓటీటీ లో’  స్ట్రీమింగ్  రెడీ!

IMG 20240725 WA0158 e1721897796903

చాందిని చౌద‌రి, వ‌శిష్ట సింహా, భరత్‌రాజ్‌, ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవ‌మ్‌. ప్రకాష్‌ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు.

జూన్‌ 14న థియేటర్లలో విడుదలై ఉత్కంఠభరితమైన కథాంశంతో రూపొందిన నవ్యమైన చిత్రంగా అభినందనలు అందుకున్న ఈ చిత్రం ఈ నెల 25 నుంచి అనగా నేటి నుంచిఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్దమైంది.

ఈ చిత్రంలో చాందిని చౌదరి పవర్‌ఫుల్‌ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపిస్తారు. కొత్తదనంతో కూడిన ఈ చిత్రంలో మహిళల గొప్పదనం, మహిళా సాధికారిత అంశాన్ని ఈ చిత్రంలో దర్శకుడు డీల్‌ చేశాడు.

మహిళలు కేవలం ఇంటికే పరిమితం కారు. వారు ఎలాంటి సమస్యనైనా పరిష్క రించగలరు అనేది ఈ చిత్రంలో చూపించారు. మిస్టరీగా వున్న ఓ కేసును ఓ మహిళా పోలీసు అధికారి ఎలా పరిష్కరించారు అనేది ఈ చిత్ర కథాంశం.

ప్రతి సన్నివేశం ఆడియన్స్‌ను అలరిస్తుంది. తప్పకుండా ఈ చిత్రాన్ని అందరూ ఆహా ఓటీటీలో వీక్షించాల్సిందిగా కోరుతున్నారు మేకర్స్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *