ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘శంబాల’. ఈ మూవీకి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఈ సినిమాను డిసెంబర్ 25న గ్రాండ్గా రిలీజ్ చేశారు.
ఈ క్రమంలో వేసిన ప్రీమియర్లకు మంచి స్పందన రావడం, మొదటి రోజు హౌస్ ఫుల్ కలెక్షన్లతో చిత్రం దూసుకుపోతోండటంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో గురువారం నాడు సక్సెస్ సెలెబ్రేషన్స్ను చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..
సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘మా నాన్న గారు విజయనగరంలో ‘ప్రేమ కావాలి’ మూవీని చూసి నాకు చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి. ఈ రోజు ప్రతీ చోటా హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఈ మాటలు వింటే నాకు మళ్లీ ఆ రోజులు గుర్తుకు వచ్చాయి. నా ఈ 50 ఏళ్లలో 300కి పైగా చిత్రాలు, వెయ్యికి పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పాను.
నేను ప్రతీ వారం వచ్చే చిత్రాల గురించి, వాటి ఫలితాల గురించి తెలుసుకుంటూనే ఉంటాను. ‘పోలీస్ స్టోరీ’కి హౌస్ ఫుల్ అవుతుందా? అనుకున్నాను. కానీ హాలు నిండినది అని బోర్డ్ చూసి నాకెంతో సంతోషం కలిగింది. మళ్లీ ఇప్పుడు ఆ మాటలు వింటున్నాను. శంబాల టీ షర్ట్ వేసుకుని నేను నిన్న థియేటర్ విజిట్కు వెళ్లాను. అలా వెళ్లిన ప్రతీ చోటా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అనిల్ రావిపూడి చెప్పినట్టుగా ఈ శుక్రవారం మేం హిట్టు కొట్టాం. అర్దరాత్రి నాకు అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ అని మెసెజ్ పెట్టారు.
ప్రతీ చోటా నుంచి మాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా మంది టికెట్ల కోసం ఫోన్ చేస్తున్నారు. దీనంతటికి కారణం డైరెక్టర్ యుగంధర్ ముని. ఆది కూడా నాలానే డైరెక్టర్ యాక్టర్. నా వాయిస్ ఓవర్ కూడా ఈ మూవీకి ప్లస్ పాయింట్ అయిందని అంటున్నారు. సనాతన ధర్మాన్ని టచ్ చేస్తూ ఈ మూవీని యుగంధర్ అద్భుతంగా తీశారు. మంచి టీంతో మహీధర్ గారు, రాజశేఖర్ గారు తీసిన ఈ మూవీని ఆడియెన్స్ పెద్ద హిట్ చేశారు. ‘శంబాల’ వచ్చిన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్ని ఆకట్టుకుంటుంది. కంటెంట్ ఉన్న చిత్రాలే విజయాన్ని సాధిస్తాయి.
అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడ్దాయి.. అన్ని చోట్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి. మన ఆది హిట్ కొట్టాడని అందరూ ఫోన్లు చేస్తున్నారు.. పుత్రోత్సాహం అంటూ ఆడియెన్స్ నాకు చెబుతున్నారు. ఇది ప్రజల విజయం. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రమిది. అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి ఈ మూవీని గొప్పగా రూపొందించారు. త్వరలోనే ‘శంబాల’ టీం సక్సెస్ టూర్ నిర్వహిస్తుంది’ అని అన్నారు.
ఆది సాయి కుమార్ మాట్లాడుతూ .. ‘‘శంబాల’ని మీడియా ఎంతగానో సపోర్ట్ చేసింది. నా ఈ సినీ ప్రయాణంలో అండగా నిలిచిన మీడియాకి, అభిమానులకు, ప్రేక్షకులకు థాంక్స్. మూవీని చూసిన వారంతా మెసెజ్లు చేస్తున్నారు. ‘శంబాల’ని ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్కి థాంక్స్. ప్రీమియర్ల నుంచి డే వన్కి అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతూనే వచ్చాయి. చాలా కాంపీటిషన్లో విడుదలైనా కూడా ఆ మూవీ పెద్ద హిట్ అయింది. త్వరలోనే థియేటర్లు పెంచబోతోన్నాం. ఈ మూవీని కచ్చితంగా థియేటర్లోనే చూడండి. అప్పుడే మీరు పూర్తిగా ఎంజాయ్ చేయగల్గుతారు. హాలీడే సీజన్ను అందరూ ‘శంబాల’తో ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.
డైరెక్టర్ యుగంధర్ ముని మాట్లాడుతూ. ‘‘శంబాల’ గత ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభించాం. గత రెండు వారాల క్రితమే సినిమాకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. ఇక సినిమాని ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎలా రిలీజ్ చేయాలి? అని మాలో టెన్షన్ మొదలైంది. ఆహా, జీ వాళ్లు మా మూవీని చూసి పోటీ పడి మరీ కొనేసుకున్నారు. మేం చాలా పోటీలో ఈ సినిమాను రిలీజ్ చేశాం. గత మూడు రోజుల నుంచి ప్రివ్యూలు వేస్తూ వచ్చాం. మీడియాకి వేసిన ప్రివ్యూ షో నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ తరువాత నేను కాస్త ఊరటగా ఫీల్ అయ్యాను. ఆ తరువాత మేం థియేటర్ విజిట్కు వెళ్లాం. అన్ని చోట్లా అద్భుతమైన స్పందన వచ్చింది. టికెట్ల కోసం చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. కానీ మాకే టికెట్లు దొరకడం లేదు. సినిమా వేసిన ప్రతీ చోటా హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్కి థాంక్స్. ఈ మూవీని థియేటర్లో చూస్తేనే సౌండింగ్ పరంగా ఆ వైబ్, ఆ ఫీలింగ్ను ఎంజాయ్ చేస్తారు. నాకు ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన ఆది గారికి థాంక్స్. ఈ మూవీ కోసం ప్రాణం పెట్టి పని చేశారాయన. నిర్మాతలైన మహీధర్ గారు, రాజ శేఖర్ గారు చాలా గట్స్ ఉన్న వ్యక్తులు. వారి సహకారంతోనే ఇంత గొప్పగా సినిమాని తీయగలిగాను. ఈ మూవీని మీ దగ్గర్లో ఉన్న థియేటర్లో చూడండి. మీరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు.
నిర్మాత మహిధర్ రెడ్డి మాట్లాడుత :‘‘శంబాల’కి ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మేం హిట్ అవుతుందని అనుకున్నాం. కానీ ఇలా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకోలేదు. అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. ఇక డిమాండ్ను పట్టి షోలు కూడా పెంచుతున్నాం. యుగంధర్ గారు గత ఏడాది నుంచి నిద్రలేని రాత్రులెన్నో గడిపి ఎంతో కష్టపడి ఈ మూవీని తీశారు. మాకు సపోర్ట్ చేసిన ఆది గారికి, మా టీంకు థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత రాజశేఖర్ అన్నభీమోజు మాట్లాడుతూ.. ‘‘శంబాల’ మూవీ సక్సెస్ అయింది. మేమంతా చాలా సంతోషంగా ఉన్నాయి. ప్రతీ చోటా హౌస్ ఫుల్స్ పడ్డాయి. ప్రీమియర్లకు అన్ని చోట్లా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇకపై మేం షోలు పెంచబోతోన్నాం. యుగంధర్ చెప్పిన కథతో ఈ ‘శంబాల’ స్టార్ట్ అయింది. మహిధర్ రెడ్డి జాయిన్ అయ్యాక ఈ మూవీ స్వరూపం,స్థాయి మారిపోయింది. మాకు సపోర్ట్ చేసిన ఆది గారికి, సాయి కుమార్ గారికి థాంక్స్. ఇంకో రెండు వారాలు మా మూవీ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హీరోయిన్ అర్చన ఐయ్యర్ మాట్లాడుతూ. ‘‘శంబాల’కి సపోర్ట్ చేస్తున్న మీడియా, ఆడియెన్స్కి థాంక్స్. కంటెంట్ ఉన్న చిత్రాలనే ఆడియెన్స్ చూస్తున్నారు. ఇలాంటి టైంలో మా మూవీకి చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. మేం ఇప్పటికే చాలా థియేటర్లకు వెళ్లి ఆడియెన్స్ రెస్పాన్స్ చూశాం. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఇందులో ప్రతీ పాత్ర అందరికీ గుర్తుండిపోతోంది. మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు’ అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ.. ‘‘శంబాల’కి అదిరిపోయేలా రెస్సాన్స్ ఇస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. నేను నా థియేటర్లో చేసిన సౌండ్లకు.. ఆడియెన్స్ థియేటర్లో ఇచ్చిన సౌండ్లు అదిరిపోయాయి. నా సౌండింగ్ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యుగంధర్కి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. మా సినిమా విజయం పట్ల టీం అంతా హ్యాపీగా ఉంది. ఆది అద్భుతమైన యాక్టర్. ఆదికి మాత్రం అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వాలని అనుకున్నాను. నేను అనుకున్నది స్క్రీన్ మీదకు వచ్చింది. నాకు సపోర్ట్ చేసిన నా టీంకు థాంక్స్. ‘శంబాల’ని కచ్చితంగా థియేటర్లోనే చూడండి. అప్పుడే ఆ ఫీల్ను మీరు ఎంజాయ్ చేయగలుగుతారు’ అని అన్నారు.
నటుడు ఇంద్రనీల్ మాట్లాడుతూ. ‘‘శంబాల’కి వస్తున్న రెస్పాన్స్ చూస్తే ఆనందంగా ఉంది. యుగంధర్ ముని గారు చాలా మందికి స్పూర్తి. సినిమాని అద్భుతంగా తీశారు. నా కటౌట్కి సరిపడే పాత్ర ఇన్నేళ్లకు దొరికింది. నన్ను నేను స్క్రీన్ పై చూసుకుని భయపడ్డాను. ప్రతీ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది కచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా’ అని అన్నారు.
నటుడు మధు నందన్ మాట్లాడుతూ .. ‘‘శంబాల’ని సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఆడియెన్స్ మా మూవీని చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఓ హిట్టు సినిమా ఆ టీం లైఫ్ మొత్తాన్ని మార్చేస్తోంది. నిర్మాతలు ఎంతో డేరింగ్తో ఈ మూవీని నిర్మించారు. మేం అంతా ఎంతో ప్యాషనేట్గా ఈ సినిమా కోసం పని చేశాం. మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్న ఆడియెన్స్కి థాంక్స్’ అని అన్నారు.
నటుడు శివ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘శంబాల’ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్ అందరికీ థాంక్స్. మా మూవీని మొదటి నుంచి కూడా సపోర్ట్ చేసిన మీడియాకు పెద్ద థాంక్స్. మీడియా సపోర్ట్ వల్లే ఈ సినిమా ఇంత వరకు వచ్చింది. ఇందులో నేను బాలు అనే పాత్రను చేశాను. నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఆది గారు ఎంత పాజిటివ్గా ఉన్నారో.. సినిమా అంత బాగా హిట్ అయింది. ఈ మూవీని అందరూ చూడండి. అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు.
నటుడు రంగస్వామి మాట్లాడుతూ.. ‘‘శంబాల’ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మీడియా, ఆడియెన్స్ మా సినిమాని అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నారు. ఆది అన్నకి అద్భుతమైన బ్లాక్ బస్టర్ వచ్చింది’ అని అన్నారు.
బేబీ చైత్ర మాట్లాడుతూ .. ‘‘శంబాల’ టీం నన్ను చాలా సపోర్ట్ చేసింది. మా సినిమా పెద్ద సక్సెస్ అవ్వడంతో మేమంతా ఆనందంగా ఉన్నాం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మా మూవీని థియేటర్లోనే చూడండి’ అని అన్నారు.